Exclusive

డివిజనల్ పౌర సంబంధాల అధికారి విలాయత్ అలీకి సత్కార సభ…

WhatsApp Image 2024-03-04 at 3.58.54 PM

సమాచార పౌర సంబంధాల శాఖలో సుదీర్ఘకాలం వివిధ హోదాలలో పనిచేసి డివిజనల్ పౌర సంబంధాల అధికారిగా ఇటీవల పదవీ విరమణ చేసిన ఎం.డి. విలాయత్ అలీ ఆత్మీయ వీడ్కోలు సభ కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డి.ఐ.పి.ఆర్.ఓ. కె. లక్ష్మీనారాయణ, తూర్పుగోదావరి జిల్లా డి.పి.ఆర్.ఓ. ఐ. కాశయ్య, సీనియర్ పాత్రికేయులు టి. మధుసూధనరావు, పౌర సంబంధాల అధికారులు, తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.

సమాచార పౌర సంబంధాల శాఖలో ప్రభుత్వ కార్యక్రమాలకు, సంక్షేమ పథకాలకు విస్తృత ప్రచారం, అవగాహన కల్పించడం తోపాటు కార్యాలయ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ అంకితభావంతో ఉత్తమ సేవలు అందించారని కొనియాడారు. జిల్లాస్థాయి అధికారులకు పాత్రికేయులకు మధ్య వారధిగా వ్యవహరిస్తూ సమర్ధవంతంగా విధులు నిర్వర్తించి మంచి గుర్తింపు పొందారన్నారు. సుమారుగా 32 సంవత్సరాలు పాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి గత నెల ఫిబ్రవరి 29న పదవీ విరమణ చేసిన ఆయన విశ్రాంతి జీవితం కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో గడపాలని ఆకాంక్షించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.