సార్వత్రిక ఎన్నికల శంఖారావానికి కేంద్ర ఎన్నికల సంఘం నగరా మ్రోగించే సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీల మధ్య పొలిటికల్ హీట్ తారాస్థాయికిచేరింది. తెలుగుదేశం వైకాపా పార్టీల మధ్య రచ్చ మొదలైంది. ఈ రచ్చ కాస్త మాటల యుద్ధానికి, మాటల యుద్ధం దాటి నేడు వ్యక్తిగత ఆరోపణలు ప్రత్యారూపణలు అవి కూడా అధిగమించి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఈ తరుణంలో కాకినాడ సిటీ నియోజకవర్గంలో ఈ ఇరు పార్టీల మధ్య ఆగ్రహవేశాలు వెలగక్కుతున్నాయి. దీనిపల్లంగా ఒక కులాన్ని ఒక జాతిని టార్గెట్ గా చేసుకుని కాకినాడ సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నోరు జారిన మాట నేడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తుంది. ఈ విషయంపై పొరుగు రాష్ట్రం పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు స్పందించి మత్స్యకార సంఘాల మద్దతు ఐక్యతను కూడగట్టి ఉద్యమాన్ని రగిలించే పనిలో ఉన్నారు.
టంగ్ స్లిప్పైంది… మీరు తగ్గండి…!!!

