జాతీయ స్థాయిలో జరుగనున్న యోగా పోటీలకు సామర్లకోట అయోధ్యరామ పురం మునిసిపల్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న కిలారి యశ్వంత్ ఎంపికయ్యాడని హెచ్.ఎమ్. తోటకూర సాయి రామకృష్ణ, వ్యాయామోపాధ్యాయుడు టీ. వైకుంఠం లు తెలిపారు. ఇటీవల వీరవాసరం లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొన్న యశ్వంత్ అత్యద్భుత ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడని పేర్కొంటూ… ఈ సందర్భంగా యశ్వంత్ ను అభినందించారు.
జాతీయ స్థాయి యోగా పోటీలకు యశ్వంత్….