జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలోని బసంత్గఢ్లోని దట్టమైన అడవులలో రెండు గ్రూపుల ఉగ్రవాదులను గుర్తించి మట్టుబెట్టేందుకు చేపట్టిన భారీ సెర్చ్ ఆపరేషన్ సోమవారం రెండో రోజుకు చేరుకుంది. ఆదివారం తెల్లవారుజామున చోచ్రు గాలా హైట్స్లోని మారుమూల పనారా గ్రామంలో ఉగ్రవాదులతో జరిగిన క్లుప్త ఎన్కౌంటర్లో గ్రామ డిఫెన్స్ గార్డ్ మరణించారు. దీని తర్వాత పోలీసులు, సైన్యం మరియు సీ.ఆర్.పీ.ఎఫ్. వేట ప్రారంభించారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, ఉగ్రవాదులను కనిపెట్టి మట్టుబెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసేందుకు అదనపు బలగాలు ఈ ఉదయం తరలించినట్లు పోలీసు అధికారి తెలిపారు.
జమ్మూ కాశ్మీర్లో ఉధంపూర్లో సీ.ఆర్.పీ.ఎఫ్. సెర్చ్ ఆపరేషన్…
