Political

జనసేనాలోకి బారీగా చేరికలు…

WhatsApp Image 2024-04-06 at 7.20.43 AM

పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీలో చేరికలు జోరుగా సాగుతున్నాయి. యు. కొత్తపల్లి, గొల్లప్రోలు, పిఠాపురం మండలాలలోని వివిధ గ్రామాల నుంచి, పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు మున్సిపాలిటీల్లోని పలు వార్డుల నుంచీ 225 మందికి పైగా ప్రముఖులు, వై.సీ.పీ. కార్యకర్తలు శుక్రవారం సాయంత్రం జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కే. నాగబాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వై.సీ.పీ. రాక్షస పాలన అంతం అవ్వడానికి పిఠాపురం వేదిక అయిందని, పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులుగా పవన్ కళ్యాణ్ ని గెలిపించుకునేందుకు ప్రజలు స్వచ్చందంగా కదిలి రావడం శుభ పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు బి. మహేందర్ రెడ్డి, జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్, పార్టీ నేతలు మర్రెడ్డి శ్రీనివాస్, నేమూరి శంకర్ గౌడ్, ప్రొ.కె. శరత్ కుమార్, కొలికొండ శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.