జనసేనలోకి వై.సీ.పీ. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చేరుతున్నారని నిర్ణయం తీసుకున్నట్లు వెళ్లడించారు. ఇందులో భగంగానే జనసేన అధినేత సవన్ కళ్యన్ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాయలసీమలో ఉన్న ఒకే ఒక్క బలిజ ఎమ్మెల్యే అయిన తనకు జగన్ టిక్కెట్ నిరాకరించి ఎర్రచందనం స్మగ్లర్గా షీట్ ఉన్న విజయానందరెడ్డి అనే సొంత వ్యక్తికి టిక్కెట్ ఇచ్చారని వాపోయారు. తనకు రాజ్యసభ ఇస్తామని ప్రచారం చేసి చివరికి మరో రెడ్డి సామాజికవర్గ నేతకు ఇచ్చారన్నారు. త్వరలో జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఆరణి శ్రీనివాసులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వియ్యంకుడు. ఉమ్మారెడ్డి కుటుంబంతోనే జగన్ టిక్కెట్ గేమ్స్ ఆడుతున్నారు. దీంతో ఆయన కూడా అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.
జనసేనలోకి వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు…

