ఆంధ్ర రాష్ట్రంలో యువతకు ఉన్న చోటే ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో జనసేన-టీ.డీ.పీ. ప్రభుత్వం పని చేస్తుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులు సైతం వై.సీ.పీ. అధికారంలోకి వచ్చాక వెనక్కి మళ్లాయనీ, కొత్తగా వచ్చిన పెట్టుబడులు కూడా ఏమీ లేవన్నారు. తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
తూములూరు సుగాలి కాలనీలో పలువురు యువకులు ఆయన సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. అనంతరం హనుమన్ పాలెం, అన్నవరపులంక గ్రామాల్లో పర్యటించారు. ప్రజలతో మమేకమవుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వై.సీ.పీ. ప్రభుత్వంలో ఇసుక దోపిడి, ఉన్న రోడ్లు నాశనం చేయడం మినహా జరిగిన అభివృద్ధి లేదు. ఎన్నికల ముందు వచ్చి ముద్దులుపెట్టి ఇప్పుడు జనాన్ని గుద్దులు గుద్దుతున్నారని విమర్శించారు.

