వారాహి విజయభేరీ యాత్రలో భాగంగా కాకినాడ రూరల్ ఇంద్రపాలెంలో బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడతూ… జగన్ సీ.ఎం. లా మాట్లాడటం లేదు ఒక సారాయి వ్యాపారిలా మాట్లాడుతున్నాడని విమర్శించారు. మద్యపాన నిషేధం చేసిన తరువాతే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడని ఎద్దేవా చేశారు. కాకినాడ పార్లమెంట్ జనసేన అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మీ, టిడిపి నాయకులు పిల్లి సత్యనారాయణ మూర్తి, బిజెపి కాకినాడ రూరల్ నాయకులు రంబాల వేంకటేశ్వరరావులు పాల్గొన్నారు.
జగన్ పై ఫైర్ అయిన జనసేన అధినేత…

