వై.ఎస్.ఆర్. కడప జిల్లా కమలాపురం లో చంద్రబాబు రా కదలి రా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున టీడీపీ, జనసేన కార్యకర్తలు తరలి వచ్చారు. చంద్రబాబు మాట్లాడుతూ… జిల్లాలో పదికి పది సీట్లు వైసిపీ గెలిచిన కానీ కడప జిల్లా ప్రజలకు జగన్ చేసింది శూన్యం అని హేళన చేసారు.వచ్చే ఎన్నికలలో పులివెందుల లో కూడా టి.డి.పి. జెండాను ఎగరవేస్తామన్నారు.
వివేకా హత్యను గుండెపోటు లాగా చిత్రీకరించలని చూసారని అన్నారు. వివేకాను ఎవరు హత్య చేసారో అందరికి తెలుసన్నారు. ప్రతిపక్షం లో ఉన్నప్పుడు హత్య కేసును సి.బి.ఐ. తో విచారణ చేయించాలని జగన్ డిమాండ్ చేసారని కాని అధికారంలోకి వచ్చాక మాట మార్చారని అన్నారు.

