బెంగళూరులోని ఆర్.ఎస్.ఐ. మైదానంలో విషాదం చోటుచేసుకుంది. బెంగళూరులో జరుగుతున్న ఏజిస్ సౌత్ జోన్ టోర్నమెంట్లో కర్ణాటక క్రికెటర్ హొయసల గుండెపోటుతో మరణించారు. తమిళనాడు, కర్ణాటకల మధ్య తీవ్ర పోటీని కలిగి ఉన్న టోర్నమెంట్ ప్రతిభావంతుడైన ఆటగాడి అకాల మరణంతో విషాదకరంగా మారింది. ఈ ఘటన బెంగళూరులోని ఆర్.ఎస్.ఐ. మైదానంలో చోటుచేసుకుంది. ఏజ్ గ్రూప్ టోర్నీల్లో కర్ణాటకకు ప్రాతినిథ్యం వహించిన హోయసల మ్యాచ్ అనంతరం హడల్కు హాజరవుతూ మైదానంలోనే కుప్పకూలిపోయాడు. ఆన్-సైట్ వైద్యులు తక్షణ అత్యవసర చికిత్సను అందించారు కానీ దురదృష్టవశాత్తు హోయసల ప్రయత్నాలకు స్పందించలేదు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం అంబులెన్స్లో బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించాడని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
గుండెపోటుతో కర్ణాటక క్రికెటర్ హొయసల మృతి…
