Political

కోనసీమ ప్రాంత నాయకులతో పవన్ భేటీ…

WhatsApp Image 2024-02-21 at 9.30.16 AM

రాజమండ్రి పర్యటణలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ కోనసీమ ప్రాంతానికి చెందిన నాయకులుతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పార్టీ ఏడు సిద్ధాంతాల్లో కులాలను కలిపే ఆలోచనా విధానం అనే సిద్ధాంతం ఒకటని ఇది కోనసీమలో కార్యరూపం దాల్చడం సంతోషంగా ఉందని స్పష్టం చేశారు. ఈ సిద్ధాంతాన్ని కోనసీమ ప్రజలు, ముఖ్యంగా యువత పరిపూర్ణంగా అర్ధం చేసుకున్నారని తెలిపారు.

కులాల మధ్య ఐక్యత తీసుకురావడం అనేది ఒక రోజులో సాద్యమయ్యే పని కాదనీ… ఆ ఐక్యత విలువను ఎప్పటికప్పుడు అందరికీ తెలియచెబుతూ రావాలన్నారు. కోనసీమ ప్రాంతాన్ని సందర్శించిన సందర్భాల్లో అనేక సామాజిక వర్గాలతో మాట్లాడటం, ఆయా సామాజిక వర్గాల ప్రతినిధులతో కులాల ఐక్యత సాధించడం గురించి మాట్లాడుతూ వచ్చానని తెలిపారు. ఈ రోజు వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు ఒకతాటి మీద ఉండి ప్రజలతో మమేకం కావడం ఒక మార్పును సూచిస్తోంది అని చెప్పారు. కాబట్టి కోనసీమలో కులాల మధ్య గొడవలు సృష్టించాలని వై.సీ.పీ. ప్రయత్నించినా సాధ్యం కాలేదు అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.