ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై బీ.జే.పీ. ఎం.పీ. తేజస్వి సూర్య మండిపడ్డారు. రాజ్యసభ ఎం.పీ. స్వాతి మలివాల్ దాడిలో సాక్ష్యాలను తొలగించడానికి ప్రయత్నాలు చేసిన విధంగా అతని పాత్ర బయటకు వచ్చిందని అన్నారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈ ఘటన ఆప్ సంస్కృతిని, డీ.ఎన్.ఏ. ను బహిర్గతం చేసిందని, ఆప్ ప్రభుత్వాన్ని తొలగించాలని ఢిల్లీ వాసులను ఆయన కోరారు.
కేజ్రీవాల్ పాత్ర మరియు ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ సంస్కృతి ఈ సంఘటన తర్వాత వెలుగులోకి వచ్చిందన్నారు. మహిళలు సురక్షితమైన వాతావరణాన్ని కలిగి ఉండాలంటే వీలైనంత త్వరగా ఆప్ ప్రభుత్వాన్ని తొలగించాలని నేను ఢిల్లీ ప్రజలకు చెప్పాలనుకుంటున్నానన్నారు.

