ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో లేదా జైలులో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని నడపాలని నిర్ణయించుకుంటే అది అపూర్వంగా, ప్రతికూలంగా ఉంటుందని సీనియర్ న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు రాకేష్ ద్వివేది మనీకంట్రోల్తో అన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని కస్టడీ నుండి నడిపించడం రాజ్యాంగ నిర్మాతలు కూడా ఆలోచించలేదని అన్నారు. శాసనసభ వ్యవహారాలను నిర్వహించే బాధ్యత ఎన్నుకోబడిన ప్రభుత్వానికి ఉంటుంది, ఒక సీ.ఎం. కస్టడీలో ఉన్నప్పుడు అతను/ఆమె ఈ బాధ్యతను నిర్వర్తించలేరని అన్నారు.
అతను తన ఇష్టానుసారం జైలు నుండి బయటకు వచ్చి సభ వ్యవహారాలను పర్యవేక్షించడానికి పిలవలేడు. కస్టడీ నుంచి బయటకు రావడం జైలు నిబంధనలు, కోర్టు ఆదేశాలపై ఆధారపడి ఉంటుందన్నారు. ఇది పెద్ద సమస్యను సృష్టిస్తుంది అని ద్వివేది అన్నారు. కేజ్రీవాల్ ఇప్పుడు ఈ.డీ. కస్టడీలో ఉన్నందున ఢిల్లీ సేవల చట్టం ప్రకారం అతను తన బాధ్యతను నెరవేర్చలేడని ద్వివేది పేర్కొన్నారు.
