Exclusive

కాకినాడలో సేవా భారతి ఆధ్వర్యంలో ఘనంగా రథసప్తమి పోటీలు…

WhatsApp Image 2024-02-16 at 2.12.38 PM

సేవా భారతి ఆధ్వర్యంలో గత 26 సంవత్సరాల నుండి రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్య నమస్కారాల పోటీ కార్యక్రమన్ని నిర్వహిస్తున్నారు. శుక్రవారం రధసప్తమి సందర్బంగా కాకినాడ గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్లో 27వ సూర్య నమస్కారాల పోటీలు ఉదయం 6 గంటలకు ప్రారంభించడం జరిగింది. కాకినాడ నగరం చుట్టు ప్రక్కల గ్రామీణ ప్రాంతాలలోని 40 ఉన్నత పాఠశాల నుండి సుమారు 423 మంది ఉత్సాహంగా పోటీపడ్డారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గాంధీ నగర్ మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర రావు, ముఖ్య వక్తగా రాష్ట్రీయ స్వయం సేవా సంఘం రాజమహేంద్రవరం విభాగ ప్రచారకులు సోమశేఖర్ పాల్గొన్నారు. అట్లూరి శివరామకృష్ణయ్య మాట్లాడుతూ… సేవా భారతి ప్రతి సంవత్సరం ఈ సూర్య నమస్కారాల పోటీలు నిర్వహిస్తున్నామని ఇదే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం కాకినాడ ఎల్బీనగర్ లో నచికేత అనే పేరుతో ఉచిత ఆవాసం నడుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య శర్మ, సేవా భారతి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావి విశ్వనాథం, సామాజిక సమరసితా వేదిక రాష్ట్ర సహా సంయోజకులు రాజా రామచంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.