కాకినాడ సంత చెరువు ప్రాంగణంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని కూల్చి వేసేందుకు వైకాపా పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తున్న విగ్రహ తవ్వకాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో సంత చెరువు దుర్గమ్మ ఆలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాకినాడ డిఎస్పి లు మురళి కృష్ణారెడ్డి, అప్పరావులు తమ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని ఇరువు పార్టీలకు చెందిన నాయకులను కార్యకర్తలను చల్లచెదురు చేశారు.
కాకినాడలో సంత చెరువు దగ్గర ఉద్రిక్తత ….

