Political

కాకినాడ రూరల్ లో శెట్టిబలిజలకే సీట్లు ఇవ్వాలి…

WhatsApp Image 2024-02-15 at 5.45.58 PM

కాకినాడ రూరల్ లో అసెంబ్లీ నియోజవర్గం శెట్టిబలిజ సామాజిక వర్గానికి కేటాయించాలని ఆ నియోజకవర్గంలో సుమారుగా అరవై వేల పైబడి ఉన్నారని అందువలనే ఆ సీటును అన్ని రాజకీయ పార్టీలు శెట్టిబలిజ సామాజిక వర్గానికి కేటాయించాలని నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కాకినాడ రామారావు పేటలో ఉన్న శెట్టిబలిజ సంఘ భవనంలో శెట్టిబలి సంఘ నాయకులు కండిపల్లి వెంకటరమణ, వాసంశెట్టి రాజేశ్వరరావు, రాయుడు దుర్గ, వాసంశెట్టి త్రిమూర్తులు, కాకరపల్లి చలపతిరావులు కలిసి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీలో ఒక్క బీ.సీ. సామాజిక వర్గీయులు ఎమ్మెల్యేలుగా లేరన్నారు. తమకి కాకినాడ రూరల్ సీటును కేటాయించాలని లేనిపక్షంలో అన్ని నియోజకవర్గాలలో స్వతంత్రలుగా పోటీ చేసి ఆయా పార్టీలకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్వతంత్రులుగా స్వతంత్ర ఎమ్మెల్యేలుగా నలుగురు గెలిచిన చరిత్ర ఉందని గుర్తు చేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.