కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరానికి న్యాయవాదులు నుంచి మంచి స్పందన లభించింది. కాకినాడకు చెందిన క్లోవే డెంటల్ హాస్పిటల్, డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ సంయుక్తంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి కాకినాడ బార్ అసోసియేషన్ భవనం నందు ఈ శిబిరం జరిగింది. న్యాయవాదులందరూ కంటి పరీక్షలు, దంత పరీక్షలు చేయించుకుని తగిన సలహాలు పొందారు. కంటికి వివిధ పరీక్షలు నిర్వహించి సలహాలు సూచనలు అందజేశారు. పంటి సమస్యలను న్యాయవాదులు అంతా కూడా ఈ శిబిరంలో పాల్గొని దంత పరీక్షలు పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి కళ్ళజోళ్లను అందుబాటులో ఉంచారు.
కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం…

