ప్యారి షుగర్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సమావేశం కాకినాడ మసీద్ సెంటర్ వద్ద యూనియన్ ఆఫీసులో సూరిబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్మిక నేత రంబాల సతీష్ మాట్లాడుతూ… ప్యారి షుగర్స్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమం కోసం అసోసియేషన్ ఏర్పాటు చేశామని వారి సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులు సభ్యత్వం నమోదు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కాంట్రాక్ట్ కార్మికులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. పని ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలని భద్రతపై అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు కే. కనకారావు, సహాయ కార్యదర్శి ఏ. ఏసుబాబు, కార్యదర్శి అత్తిలి బాల సూర్యనారాయణ, కోశాధికారి ఆది బాబు, తదితరులు పాల్గొన్నారు.
