బీ.జే.పీ. నేతల నిరసన చిత్రాన్ని మార్ఫింగ్ చేసినందుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పాటు కాంగ్రెస్ రాష్ట్ర ఐ.టీ. సెల్ హెడ్ బీ.ఆర్. నాయుడుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నగర పోలీసులను ప్రత్యేక కోర్టు ఆదేశించింది. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత ఆందోళనలో పాల్గొన్న కరసేవక్ శ్రీకాంత్ పూజారిని ఇటీవల అరెస్టు చేసినందుకు వ్యతిరేకంగా బీ.జే.పీ. నాయకులు ప్రదర్శనలో పాల్గొన్నారు.
బీ.జే.పీ. ప్రదర్శనకారులు ‘నేను కూడా కరసేవక్నే’ నన్ను కూడా అరెస్టు చేయండి అని రాసి పట్టుకున్న ప్లకార్డులను కాంగ్రెస్ ఐ.టీ. సెల్ ప్లకార్డులపై రాతలను మార్ఫింగ్ చేసి మోసాలు మరియు ఇతర అక్రమాలకు సంబంధించిన ఒప్పుకోలు స్టేట్మెంట్ లాగా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇదే విషయాన్ని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ శివకుమార్ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. వర్గాల మధ్య శత్రుత్వాన్ని సృష్టించేందుకు తప్పుడు పత్రాన్ని ఉపయోగించారని పేర్కొంటూ బీ.జే.పీ. లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ యోగేంద్ర హోడఘట్ట ఎం.పీ. లు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేశారు.

