తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోక్ సభ అభ్యర్థుల పేర్లపై కాంగ్రెస్ అగ్రనేతలు సోమవారం చర్చించారు. ఎ.ఐ.సి.సి. ప్రధాన కార్యాలయంలో జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ సి.ఈ.సి. సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. ఏ.ఐ.సీ.సీ. ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్ తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పీ.సీ.సీ. చీఫ్ వై.ఎస్. షర్మిల వేర్వేరుగా సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమావేశంలో సీ.ఈ.సీ. సభ్యులు మధుసూదన్ మిస్త్రీ, అమీ యాగ్నిక్, కేజే జార్జ్ కూడా పాల్గొన్నారు. ఏడు దశల లోక్సభ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది.
ఏడు దశల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్… ఏప్రిల్ 19న ప్రారంభం…

