విశాఖ రేంజ్ నూతన డీ.ఐ.జీ. గా విశాల్ గున్నిఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన్ని విశాఖపట్నం రేంజ్ పరిధిలోని అదనపు ఎస్పీలు, ఏఎస్పీలు మర్యాధపూర్వకంగా కలిసి అభినందనలు తెలియచేసారు. ఇందులో భాగంగా మన్యం పార్వతిపురం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు సంబంధంచి శాంతి భద్రతలు, కమ్యూనిటీ పోలీసింగ్, తదితర విషయాలపై అధకారులతో సమావేశాన్ని నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ… త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల దృష్య ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని, ప్రశాంతి వాతావరణంలో ఎన్నికలను నిర్వహించే విదంగా ప్రణాళికలు తీసుకోవాలని సూచించారు. దీనిలో భాగంగా చెక్ పోస్ట్ల వద్ద పటిష్ఠమయిన తనిఖీలు చేపట్టాలని అధికారులకు ఆధేశాలు జారీచేసారు. సమస్యాత్మక ప్రదేశాలలో కూడా భద్రతలను పెంచాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రాహుల్ మీనా, పి. సత్యనారాయణ రావు, ఏఎస్పీ కే. ధీరజ్, తదితరులు పాల్గొన్నారు.

