కరప మండలం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో నిర్వహించిన కాకినాడ జిల్లా స్విమ్మింగ్ పోటీలు ఎంతో ఉత్సాహభరితంగా ముగిసాయని జిల్లా ప్రెసిడెంట్ పెదిరెడ్డి సతీష్ తెలిపారు . ఈ పోటీలకు ముఖ్యఅతిథిలుగా గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ గ్రంధి నారాయణ రావు గారు , సిమ్మింగ్ అసోసియేషన్ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ పెదిరెడ్డి సతీష్ , తదితరులు హాజరైయ్యారు. ఈ పోటీలలో 5 విభాగాల 78 ఈవెంట్లలో 100 మంది వరకూ బాల బాలికలు పాల్గొన్నారని తెలిపారు. కోచ్ లుగా ఉదయ (సాయి కోచ్ ), సాప్ కోచ్ నాయుడు, శ్రీహరి , పి. నాని, ఎం.అజయ్ కుమార్ , వి.వీరభద్రయ్య , ఐ. వీరబాబు వ్యవహరించారు. ఈ పోటీలలో విజేతలైన వారు పల్నాడు జిల్లా నరసరావుపేట ఎస్.ఎస్.ఎన్. కాలేజ్ లో ఈనెల 16, 17 తేదీలలో జరగబోయే 9వ రాష్ట్రస్థాయి జూనియర్ ,సబ్ జూనియర్ వింటర్ ఆక్వాటిక్ పోటీలలో పాల్గొంటారని ఆయన అన్నారు.
ఉత్సాహభరితంగా ముగిసిన కాకినాడ జిల్లా స్విమ్మింగ్…

