వై.సీ.పీ. ప్రభుత్వ అరచాక అవినీతి పాలనలో అదోగతి పాలయ్యన ఆంధ్ర రాష్ట్రన్ని అభవృద్ధి పదంలో నడిపించాలంటే తెలుగుదేశం, జనసేన, బీ.జే.పీజ కూటమి అధికారంలోకి తీసుకురావలిసిన ఆవశ్యకత నేడు రాష్ట్ర ప్రజలపై ఉందని కాకినాడ సిటీ టీ.డీ.పీ. ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు.
తెలుగుదేశం, జనసేన, బీజేపీ, పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో చిలకలూరిపేట మండలం, బొప్పూడి వద్ద నిర్వహిస్తున్న ప్రజాగళం బహిరంగ సభకు కాకినాడ సిటీ నియోజకవర్గం నుండి బస్సులు కార్లతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి కొండబాబు ర్యాలీగా చిలకలూరిపేట బయలుదేరారు.
ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ… ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత ప్రధాని నరేంద్ర మోడీ, విజినరీ నాయకుడు చంద్రబాబు, పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మొట్టమొదటిగా చిలకలూరిపేట నందు ఉమ్మడి వేదికగా ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించడం జరుగిందని అన్నారు.

