పేద ప్రజలు ఆశించిన ఇందిరమ్మ రాజ్యం తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ కేంద్ర మంత్రి, సిడబ్ల్యూసి మెంబర్ ఎం.ఎం. పళ్ళం రాజు పేర్కొన్నారు. కాకినాడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చిలుకోటి పాండురంగా రావు అధ్యక్షతన నూతన నగర కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పళ్ళంరాజు పాల్గొన్నారు. కాకినాడ సిటీ అధ్యక్షుడు దాట్ల గాంధీరాజు నేతృత్వంలో, జిల్లా అధ్యక్షుడు చిలుకోటి పాండురంగా రావు నూతన కమిటీ సభ్యులచే ప్రమాణస్వీకారం చేయించి, సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు.
ఇందిరమ్మతోనే రాష్ట్ర అభివృద్ధి…

