లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ తన ఆప్ కా రాంరాజ్య వెబ్సైట్ను ప్రారంభించింది. రామరాజ్యం అనే పార్టీ భావనను హైలైట్ చేసే లక్ష్యంతో, జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నాలు దేశ రాజధానిలో రాముడి ఆదర్శాలను సాకారం చేసే దిశగా మళ్లించబడ్డాయని చెప్పారు.
aapkaramrajya.com వెబ్సైట్ను ప్రారంభించేందుకు ఏప్రిల్ 17న రామ నవమి సందర్భంగా పార్టీ ఆ రోజును ఎంచుకున్నట్లు తెలిపింది. వెబ్సైట్ను ప్రారంభించిన పార్టీ ఎం.పీ. సంజయ్ సింగ్ మాట్లాడుతూ… ఈ వెబ్సైట్ పార్టీ స్వంత కాన్సెప్ట్ అయిన రామరాజ్యంను ముందుకు తెస్తుందని, దేశంలో ఏ.ఏ.పీ. ప్రభుత్వాలు చేస్తున్న పనిని కూడా హైలైట్ చేస్తుందని అన్నారు.

