Exclusive

ఆంధ్ర రాష్ట్రంలో వై.సీ.పీ. పాలనకు రోజులు వచ్చాయి… -చంద్రబాబు నాయుడు-

OIP (6)

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్‌సీపీకి రోజులు దగ్గర పడ్డాయని టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ధోనే జిల్లాలోని జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ.. ఐదేళ్ల పాలనలో సచివాలయానికి వెళ్లని ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారా అని వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి పై విరుచుకుపడ్డారు. ఐదేళ్ల పాలనలో సచివాలయానికి వెళ్లని ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారా? ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో ఏదైనా ప్రాజెక్టు కట్టారా, ఎవరికైనా ఒక్క ఉద్యోగం ఇచ్చారా అని నాయుడు ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద పెండింగ్‌లో ఉన్న రూ. 1,500 కోట్ల బకాయిలను ఆసుపత్రులకు చెల్లించడంలో విఫలమై రెడ్డి ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టారని అన్నారు. ఇక, తాను ఎన్నికల్లో గెలిస్తే విద్యుత్ ఛార్జీలను ఎప్పటికీ సవరించబోనని, విద్యుత్ కోతలు ఉండవని మాజీ సీ.ఎం. హామీ ఇచ్చారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.