Exclusive

అవినీతే వై.సీ.పీ. అజెండా… -ప్రధాని మోదీ-

4754ffb8-329a-412b-8e13-91642a989e92

అనకాపల్లి ఎన్డీఏ ఎన్నికల సభను ఘనంగా ఏర్పాటుచేసారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అవినీతి మంత్రమయితే.. భారతీయ జనతా పార్టీది అభివృద్ధి మంత్రమని.. పేర్కొన్నారు. వైన్, మైన్, ల్యాండ్, శాండ్, లో కోట్లు దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆటంకాలు సృష్టిస్తూ ప్రజలను అడ్డంగా ముంచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి వైఎస్ఆర్ నుంచి రాజకీయ వారసత్వం అందుకున్న జగన్ ఆయన ప్రారంభించిన ఇరిగేషన్ ప్రాజెక్టులను మాత్రం పూర్తి చేయలేకపోయాడని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ తోనే సాధ్యమని నొక్కి చేప్పారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.