లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్ భారత కూటమిపై హర్షం వ్యక్తం చేసారు. తాము చెక్కుచెదరకుండా ఉన్నామని, విజయాన్ని సాదిస్తామని ధీమ వ్యక్తం చేసారు. మేము అమేథీ, రాయ్బరేలీలో గెలుస్తామని ఆయన చెప్పారు. ఎక్కడికి వెళ్లినా ప్రజల అభిప్రాయాలను చూడవచ్చని, భారత కూటమికి అన్ని అనుకూలంగా ఉన్నాయని ఆయన అన్నారు. బీ.జే.పీ. 150 సీట్లకు మించి గెలవదని రాహుల్గాంధీ చెప్పడాన్ని ప్రశ్నించగా, రాహుల్ వద్ద గణాంకాలు ఉన్నాయని, ఆయన దేశవ్యాప్తంగా పర్యటించారని, ఆయనకు ప్రజల పల్స్ తెలుసునని అన్నారు.
ఇదిలావుండగా, అమేథీ నుండి కాంగ్రెస్, భారత కూటమి అభ్యర్థి కే.ఎల్. శర్మ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అమేథీలో సంయుక్త ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ… మొదటి 4 దశల తర్వాత బీ.జే.పీ. ఓడిపోయిందని, 140 సీట్లు గెలుచుకోవడానికి కష్టపడుతుందని అన్నారు.

