డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం పట్టణములోని మార్కెట్ వీధిలో గల డోర్ నెం. 2-4-63/2 నందు పి.డి.ఎస్. చౌక బియ్యం అక్రమ నిల్వకు సంబంధించి విశ్వసనీయ సమాచారంపై విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో కలిసి సదరు ఇంటిని తనిఖీ చేసారు. ఆ తనిఖీల్లో 24 బస్తాలలో 1200 కేజీల పి.డి.ఎస్. బియ్యాన్ని గుర్తించారు. పి.డి.ఎస్. బియ్యం అమలాపురం మండలంలోని నడిపూడి గ్రామానికి చెందిన అరిగెల వీరాంజనేయులుకి చెందిందిగా అధికారులు గుర్తించారు.
పీ.డీ.ఎస్. బియ్యంకు సంబందించి ఎటువంటి బిల్లులు లేకపోవడంతో సివిల్ సప్లయ్స్ అధికారులు, అమలాపురం అధికారులు రూ. 54,600/- లు విలువ గల 1200 కేజీల పి.డి.ఎస్ చౌక బియ్యాన్ని సీజ్ చేసి 6-ఏ క్రింద కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. ఈ తనిఖిలలో కార్యాలయ ఇన్స్పెక్టర్ నాగ వెంకటరాజు, సబ్ ఇన్స్పెక్టర్ జగన్నాధ రెడ్డి, అమలాపురం సి.ఎస్.డి.టి భారతి, హెడ్ కానిస్టేబుల్ జీవానందం కానిస్టేబుల్ వీరబాబు మరియు రెవెన్యూ, సివిల్ సప్లయ్స్ అధికారులు పాల్గొన్నారు.

