తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు డాక్టర్ బి.ఆర్ .అంబేద్కర్ కోనసీమజిల్లాలోని అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాన్ని మెట్ల రమణబాబు స్వగృహం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సుబ్రమణ్యం, అనంత కుమారి, అమలాపురం తెలుగుదేశం అభ్యర్థి అయితా బత్తుల ఆనందరావు, రామచంద్రపురం తెలుగుదేశం అభ్యర్థి వాసంశెట్టి సుభాష్, పార్లమెంట్ అభ్యర్థి హరీష్ మాధూర్, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి జోగేశ్వరరావు, బీ.జే.పీ. పార్టీ నుంచి అయ్యా జి. వేమ, ఏళ్ళదొరబాబు, జనసేన నుంచి గుద్దటి జమ్మి, ఏడిద శ్రీను, హాజరయ్యారు. కానీ జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ, ముమ్మిడివరం, కొత్తపేట, రాజోలు అభ్యర్థులు ఈ కార్యక్రమంలో హాజరు కాకపోవడంతో పార్టీలో అసంతృప్తి నెలకొంది. దీనితో వారు పార్టీ మరతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
అమలాపురంలో టీ.డీ.పీ. సమన్వయ కమిటీ సమావేశం…

