ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండంతో జనసేన పోటీ చేసే స్థానాల్లో ప్రచారం చేపట్టాలి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ జనసేన కార్యకర్తలకు, నాయకులకు దిశా నిర్దేశం చేసారు. సమావేశాన్ని ఏర్పాటుచేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ ఈసారి శాసనసభలో బలమైన అడుగు వేయాలి అని పవన్ కల్యాణ్ ఆకాంక్షిస్తున్నారన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరం బాధత్యతో పని చేయాలని తెలిపారు.
ఇందుకోసం మహిళా నేతలు సన్నద్ధం కావాలన్నారు. ప్రస్తుతం జనసేన పార్టీ బరిలోకి దిగుతున్న నియోజకవర్గాల్లో మీకు కొన్ని బాధ్యతలు అప్పగించాలని అధ్యక్షుల వారు నిర్ణయించారు. మహిళా, యువ ఓటర్లతో మన పార్టీ విధానాలు, ప్రజలకు ఏ విధంగా అండగా ఉంటున్నదీ తెలియచెప్పాలని ఆయన అన్నారు. మన అభ్యర్ధులంతా విజయం సాధించాలి అన్నారు.

