Political

అన్ని పార్టీలు ఢిల్లీ నిరసనలో పాల్గొనాలని జగన్ పిలుపు…

973382-ys-jagan

ఆంధ్రప్రదేశ్‌లో టీ.డీ.పీ. నేతృత్వంలోని ఎన్డీయే హయాంలో తమ పార్టీ క్యాడర్‌, నేతలపై జరుగుతున్న దాడులను ఎత్తిచూపేందుకు జూలై 24న న్యూఢిల్లీలో పార్టీ నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ… దేశ రాజధానిలో నిరసన నిర్వహించడం ద్వారా గత 45 రోజులలో రాష్ట్రం యొక్క విపత్కర పరిస్థితిని దేశం ముందు ప్రదర్శించాలనుకుంటున్నామని అన్నారు.

శనివారం జరిగిన వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసానికి వ్యతిరేకంగా పార్లమెంటు ఉభయ సభల్లో తమ పార్టీ ఎం.పీ. లు గళం విప్పనున్నారన్నారు. ఈ దురాగతాలపై జాతీయ దృష్టిని తీసుకురావడమే మా లక్ష్యం అని ఆయన నొక్కి చెప్పారు. ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి అపాయింట్‌మెంట్ కోరామని, అది రాగానే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తామని జగన్ చెప్పారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.