తూర్పు గోదావరి జిల్లాలో అనపర్తి మండలంలో టీ.డీ.పీ. కి భారీ షాక్ తగిలింది. స్థానిక ఎస్.ఎన్.ఆర్. కళ్యాణ మండపంలో అనపర్తి నియోజకవర్గానికి చెందిన టీ.డీ.పీ. నాయకులు ఆ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సమక్షంలో బీ.జే.పీ. లోకి స్వచ్చందంగా చేరారు. ఈ సందర్భంగా ఆమె వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పార్టీ భలోపేతానికి మనమందరం కృషి చేయాలని సూచించారు.
అనపర్తిలో టీ.డీ.పీ. కి భారీ షాక్…

