Political

అనంతపురం శంఖారావం సభలో నారా లోకేష్…

Nara-Lokesh-TDP-MLC-Elections-

అనంతపురం జిల్లాలో టీడీపీ ఇన్‍ఛార్జ్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో శంఖారావం మహా సభను నిర్వహించారు. ఇందులో భాగంగా రుద్రంపేట లో ఏర్పాటు చేసిన శంఖారావం మహా సభా ప్రాంగణానికి భారీగా టీడీపీ-జనసేన శ్రేణులు తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారా లోకేష్ విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడం, బాబు సూపర్ సిక్స్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై క్యాడర్ కు దిశనిర్దేశం చేసారు.

బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ అమలులో మెరుగైన పనితీరు కనబర్చిన కార్యకర్తలకు ప్రశంసపత్రాలు అందజేస్తామని చెప్పారు. సభ ముగిసిన అనంతరం మధ్యాహ్నం తాడిపత్రి శంఖారావం సభకు హాజరుకానున్నట్లు లోకేష్ తెలిపారు. తాడిపత్రి సభతో మలివిడత శంఖారావం సభ ముగియనుందని పేర్కొన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నాలుగురోజుల పాటు 10 నియోజకవర్గాల్లో శంఖారావం యాత్ర సాగిందని అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.