తిరుమల తిరుపతి దేవస్థానం టీ.టీ.డీ. నుంచి పాలనా ప్రక్షాళన ప్రారంభమవుతుందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పవిత్రమైన కొండపై గోవింద నామం మాత్రమే వినిపించేలా చూస్తానని బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్న నాయుడు తన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్తో కలసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
గంజాయి, మద్యం, మాంసాహారానికి కేంద్రంగా మారిన తిరుమల పవిత్రతను కాపాడడంలో గత ప్రభుత్వం విఫలమైందని నాయుడు ఆరోపించారు. గత ప్రభుత్వం టీ.టీ.డీ. ని కూడా వ్యాపారమయం చేసిందన్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టకుండా, భక్తులపై ఆంక్షలు విధించింది మరియు రోడ్లపై కర్టెన్లు వేయడం ప్రారంభించిందన్నారు.
