పశ్చిమ బెంగాల్లోని హౌరా భారతదేశంలోనే అత్యంత మురికి నగరం అని ఇటీవల విడుదల చేసిన 2023 వార్షిక పరిశుభ్రత సర్వే ‘స్వచ్ఛ్ సర్వేక్షణ్’ లో వెళ్లడయ్యింది. ముఖ్యంగా 1 లక్ష కంటే ఎక్కువ జనాభా కలిగిన 10 మురికి నగరాలు అన్నీ పశ్చిమ బెంగాల్కు చెందినవేనని తెలిపింది. కళ్యాణి, మధ్యగ్రామ్, కృష్ణానగర్, అసన్సోల్, రిష్రా, బిధాన్నగర్, కంచరపరా, కోల్కతా, భట్పరా కేటగిరీలో హౌరా తర్వాత దేశంలోని అత్యంత మురికి నగరాలుగా సర్వేలో తేలింది.
పరిశుభ్రమైన కంటోన్మెంట్ బోర్డుల విభాగంలో మధ్యప్రదేశ్లోని మోవ్ కంటోన్మెంట్ బోర్డ్ టాప్ ర్యాంక్ సాధించగా, నైనిటాల్ కంటోన్మెంట్ అట్టడుగు ర్యాంక్ సాధించిందని వెళ్లడించింది. అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు 2023 ప్రకటించారు. ఈ కార్యాక్రమానికి అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
