ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలతో సహా అణగారిన వర్గాలను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపణలపై బీ.జే.పీ. ఎం.పీ. సుధాన్షు త్రివేది కౌంటర్ ఇచ్చారు. సాంఘిక సంక్షేమంలో ప్రభుత్వ ప్రయత్నాలను త్రివేది ఎత్తిచూపారు. ఈ సమూహాలకు బడ్జెట్ కేటాయింపులను ప్రశ్నిస్తున్నందుకు ప్రతిపక్షాలను విమర్శించారు. గత ప్రభుత్వాలు తగిన మద్దతును అందించడంలో విఫలమయ్యాయని, అయితే ప్రస్తుత ప్రభుత్వం చారిత్రక అసమానతలను పరిష్కరించడానికి కృషి చేస్తోందని నొక్కి చెప్పారు. బీ.జే.పీ. ఎం.పీ. సుధాన్షు త్రివేది మాట్లాడుతూ… భారత్ కూటమి వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కుల గణన నిర్వహించాలన్నారు. హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, పశ్చిమ బెంగాల్లో ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
అట్టడుగు వర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నారు… -బీ.జే.పీ. ఎం.పీ.-

