octafx.com వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా అక్రమ ఆన్లైన్ ఫారెక్స్ ట్రేడింగ్ కేసు విచారణలో భాగంగా ముంబై, చెన్నై, కోల్కతా మరియు ఢిల్లీలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్వయంతో సోదాలు నిర్వహించింది. OctaFx ఇండియా Pvt Ltd, OctaFx మరియు వాటి అనుబంధ సంస్థలు ఫారెక్స్ ట్రేడింగ్ ముసుగులో పెట్టుబడిదారులను మోసం చేశాయని, తద్వారా భారతదేశం నుండి రూ. 500 కోట్లకు పైగా లాభాన్ని ఆర్జించాయని ఈ.డీ. తెలిపింది. ఈ నిధులలో కొంత భాగాన్ని షెల్ ఎం.టి.టీ. ల సహాయంతో సంక్లిష్టమైన లావాదేవీల వెబ్లో పొరలుగా చేసి, బోగస్ సరకు రవాణా సేవలు, సేవల దిగుమతి మొదలైన వాటి ముసుగులో విదేశాలకు దాని సంబంధిత సంస్థలకు పంపబడిందని తెలిపింది.
స్పెయిన్, రష్యా మరియు దుబాయ్లోని షెల్ కంపెనీల ద్వారా నేరాల ఆదాయాన్ని లాండరింగ్ చేయడంలో నిందితుల క్రిప్టోకరెన్సీలు, బ్యాంక్ బ్యాలెన్స్లు మరియు బంగారు నాణేలు సహా రూ. 35 కోట్ల ఆస్తులను ఏజెన్సీ ఇప్పటికే అటాచ్ చేసింది. సెర్చ్ ఆపరేషన్లలో రూ. 2.7 కోట్ల బ్యాంకు డిపాజిట్లు నిలిపివేసింది.అంతేకాకుండా నేరారోపణ పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

