తెలంగాణ రాష్ట్రంలో జిల్లా డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో తొలి సదస్సును సీ.ఎం. ఏ. రేవంత్రెడ్డి నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై చర్చించేందుకు కీలక సమావేశాన్నా నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా అగ్రస్థానంలో ఉన్న ఆరు హామీలను 100 రోజుల్లో అమలు చేయడంతో పాటు లోపాలను అరికట్టే చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. దానితో పాటు గ్రామస్థాయి వరకు ఆ పాలనను తీసుకురావడంపై సంబందిత అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నారని ఒక ప్రకటనలో వెళ్లడించారు. ఈ సమావేశంలో కలెక్టర్లు, ఎస్పీలు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

