కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రాలలో ఉన్న పెట్రోల్ బంకుల్లో రోబరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర పార్థి గ్యాంగ్ ను అనంతపూరం జిల్లాకు చెందిన పోలీసులు పట్టుకున్నట్లు వెళ్లడించారు. ఐదుగురు పార్టీ గ్యాంగ్ సభ్యులను, ముగ్గురు రిసీవర్లను అరెస్ట్ తీసుకున్నట్టు తెలిపారు. వీరి నుంచి రూ. 3.50 లక్షల నగదు, రెండు లారీలు, 2 చేతి పంపులు,100 మీటర్ల పైపు, 50 ఖాళీ డీజిల్ క్యాన్లు స్వాధీనం చేసునున్నామని అధికారులు తెలిపారు.
వీటి విలువ మొత్తం రూ. 35 లక్షలు ఉంటుందన్నారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ కే.కే.ఎన్. అన్బురాజన్ మాట్లాడుతూ… ఆంధ్ర, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలో వీరి పై పలు రోబరీలలో కేసులు నమోదయ్యయని అన్నారు. పెట్రోలు బంకులతో పాటు టైర్ల స్టాక్ గోడౌన్లలో కూడా దొంగతనాలు చేసినట్లు వెళ్లడించారు. శివారు ప్రాంతాల్లోని పెట్రోలు బంకులే వీరి టార్గెట్ అని అన్నారు.

