istockphoto-1173573016-170667a Exclusive

తల్లి మందలించడంతో బాలుడు ఆత్మహత్య…

వరంగల్ జిల్లాలో ధారుణం చోటుచేసుకుంది. ఎండలో ఆడుకోవద్దని తల్లి చెప్పడంతో 6 సంవత్సరాల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దుగ్గొండి మండలం మైసంపల్లికి చెందిన సిద్దు అనే బాలుడు మూడో తరగతి చదువుతున్నాడు. అయితే స్కూల్స్ కు వేసవి సెలవులు ఇవ్వడంతో ఎండలో ఎక్కువగా ఆడుకుంటున్నాడని తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన ఎవరూ లేని సమయం చూసి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే తల్లితండ్రులు బాలుడుని ఆసుపత్రికి తరలించారు.