చూస్తుండగానే విరిగిపడిన కొండచరియలు… పరుగులు తీసిన ప్రజలు…
ఉత్తరాఖండ్ లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఉత్తరాఖండ్ కు వచ్చిన పర్యాటకులు చూస్తుండగానే అక్కడున్న కొండచరియలు అకస్మాత్తుగా విరిగిపడ్డాయి. దానితో అక్కడున్న జనం భయంతో దూరంగా పరుగులు పెట్టారు. ఉత్తరాఖండ్ చమోలీలో బద్రీనాథ్ జాతీయ రహదారిపై ప్రజలు చూస్తుండగానే ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి.
