వడ్లు కొన్న 2 రోజుల్లోపు ఖాతాల్లో డబ్బులు వేస్తాం… -కాంగ్రెస్ ప్రభుత్వం-
యాసంగి ధాన్యం విక్రయాల్లో కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా, ఇక్కడి బియ్యం అక్రమంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. దీని కోసం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో 56 చెకోపోస్టులను ఏర్పాటు చేసినట్లు వెళ్లడించింది. వరి కోతలు మొదలైన ప్రాంతాల్లో మార్చి 25 నుంచే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని […]









