vemula Telangana

రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల మృతిపై రీ-ఇన్వెస్టిగేషన్‌కు అనుమతులు…

రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల మృతిపై గత ప్రభుత్వం రూపొందించిన నివేదికను తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి విశ్వసించలేదని, ఈ కేసుపై మళ్లీ విచారణ న్యాయంగా, పారదర్శకంగా జరుగుతుందని హామీ ఇచ్చారని మృతుడి సోదరుడు రాజా వేముల తెలిపారు. శుక్రవారం తెలంగాణ పోలీసులు ఈ కేసులో క్లోజర్ రిపోర్టు దాఖలు చేసి అప్పటి సికింద్రాబాద్ ఎం.పీ. బండారు దత్తాత్రేయ, శాసనమండలి సభ్యుడు ఎన్. రామచందర్ రావు, వైస్ ఛాన్సలర్ అప్పారావు, అఖిల భారతీయ విద్యార్థి […]

WhatsApp Image 2024-05-04 at 6.01.21 AM Exclusive

మతాల మధ్య చిచ్చుపెట్టడం మంచిదికాదు… -కే.సీ.ఆర్.-

రాజకీయాలల్లో మతం గురించి మాట్లాడటం చాలా అమానుషమని, అది పెద్ద తప్పు, అది ఎన్నికల నిబంధనలకు విరుద్ధంమని తెలంగాణ మాజీ ముఖ్య మంత్రి కే.సీ.ఆర్. అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా రోజు హిందూ, ముస్లింలు అంటూ మతాలను వేరుచేసి, ఆ మతాల మధ్య గొడవలు పెడుతూ మాట్లాడితే అది ఎలెక్షన్ కమీషన్ కి కనబడదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి హామీల గురించి అడిగితే నన్ను నీ గుడ్లు పికి గోళీలు ఆడుతా, నీ […]

Revanth1 Telangana

ఫేక్ వీడియో కేసు పై సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసు జారీ…

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన ఫేక్ వీడియో కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మే 1వ తేదీ లోగా సమాధానం ఇవ్వాలని రెడ్డిని ఆదేశించింది. అయితే కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం ఎలాంటి నోటీసులు అందుకోలేదని తిరస్కరించింది. రిజర్వేషన్లపై తన వైఖరిని తప్పుగా సూచిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియోను ప్రసారం చేసినందుకు బాధ్యులైన వ్యక్తులపై చర్యలు తీసుకున్నట్లు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఆదివారం తెలియజేసింది. […]

WhatsApp Image 2024-04-13 at 8.06.56 AM Telangana

సమన్వయకర్తగా బొంగునూరి మహేందర్ రెడ్డి నియామకం…

తెలంగాణలో రానున్న పార్లమెంటు ఎన్నికల జనసేన పార్టీ తరఫున సమన్వయం కోసం కమిటీని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించారు. శుక్రవారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ తెలంగాణ నాయకుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీకి పార్టీ ఉపాధ్యక్షులు బొంగునూరి మహేందర్ రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. కమిటీలో అయిదుగురు సభ్యులు ఉంటారని తెలిపారు. ఈ కమిటీలో సభ్యులుగా నేమూరి శంకర్ గౌడ్, రాధారం రాజలింగం, పొన్నూరి శిరీష, ముమ్మారెడ్డి ప్రేమ్ […]

WhatsApp Image 2024-04-12 at 10.05.11 AM Telangana

సాగునీరు కోసం రోడ్డెక్కిన రైతన్నలు…

నిర్మల్ జిల్లాలో కడెం మండలంలోని నచ్చన్ఎల్లాపూర్ వద్ద ప్రధాన రహదారిపై పలువురు రైతులు సదర్మాట్ చివరి ఆయకట్టు వరకు సాగు నీటిని అందించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ఇప్పటికైనా సాగు నీటిని విడుదల చేయాలని లేదంటే ఆందోళనలు ఉదృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.

OIP (30) Viral

వ్యాపారవేత శరత్ రెడ్డి ని కె కవిత బెదిరించింది… -సీబీఐ –

కోర్టు ముందు సమర్పించిన సి.బి.ఐ. వాంగ్మూలాల ప్రకారం.. ఏ.ఏ.పీ. ఆరోపించిన కిక్‌బ్యాక్‌లకు డబ్బు చెల్లించకపోతే అతని వ్యాపారానికి హాని చేస్తానని శరత్‌ రెడ్డిని కే. కవిత హెచ్చరించారని ఆరోపించారు. కస్టడీని పొడిగించాలని కోరుతూ.. ఈ కుంభకోణంలో కవిత ప్రధాన పాత్ర పోషించిందని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడైన విజయ్ నాయర్‌కు నిధులు చేరవేసేందుకు ఆమెను కీలక కుట్రదారుగా అభివర్ణించారు. సౌత్ గ్రూప్ కి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త మొదట్లో కేజ్రీవాల్‌తో ఒప్పందం చేసుకున్నారని […]

WhatsApp Image 2024-04-11 at 6.25.32 PM Viral

పట్టపగలే ఇంట్లో దొంగలు పడ్డారంటూ డ్రామా ఆడిన యువతి… కానీ…!!!

తెలంగాణ రాష్ట్రంలో వింత ఘటన చోటుచేసుకుంది. రంగా రెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ఎర్రబోడ కాలనీలో ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు అపహరణ. గట్టిగా కేకలు వేస్తూ పట్టుకునే ప్రయత్నం చేసిన బాలికను తోసి దుండగులు పరారయ్యారని ఆమె డ్రామాలు ఆడింది. కానీ కట్ చేస్తే… యువతి వేసిన స్కెచ్ బెడిసికొట్టింది. విచారణలోకి వెళ్తే… ఆన్‌లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్న యువతి చోరీ డ్రామా చేసింది. దొంగలు ఇంట్లోకి చొరబడి […]

OIP (20) Exclusive

ఒవైసీకి వ్యతిరేకంగా పోటీ చేయనున్న హైదరాబాద్ ఎం.పీ. అభ్యర్థి మాధవి లత…

హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొంపెల్ల మాధవి లతపై ప్రధాని నరేంద్ర మోదీ తన దృష్టిని పెంచారు. 49 ఏళ్ల క్లాసికల్ డ్యాన్సర్ మరియు పారిశ్రామికవేత్త మే 13 వ తేదీన జనగబోయే ఎన్నికల్లో హైదరాబాద్ ఎం.పీ. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీతో తలపడనున్నారు. తన రాజకీయ ప్రత్యర్థి ఒవైసీ ఈసారి 1,50,000 ఓట్ల తేడాతో ఓడిపోతారని ఆమె జోస్యం చెప్పింది. దానితో ప్రధాని మోడీ ఎక్స్‌ లో […]

74c28815-08e2-475a-a8b7-259ab27de71f Exclusive

పంట సాగు నష్టాలతో ఇద్దరు యువ రైతుల ఆత్మహత్య…

భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోర్లు వేసి లక్షల్లో అప్పుల పాలై ఉరి వేసుకుని ఇద్దరు యువ రైతులు ఒకే రోజు చనిపోతుయారు. తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు నెలల్లోనే 220 మంది పైగా రైతులు మృతి చెందగా ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవట్లేదు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం బుకాయిస్తుంది. మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంత గ్రామానికి చెందిన బాంచ మహేందర్, తనకున్న 2 ఎకరాల పొలంలో వరి సాగు చేస్తూ ఉన్న బోరు […]

WhatsApp Image 2024-04-06 at 10.35.16 PM Exclusive

ఆత్మహత్య చేసుకున్న లక్ష్మినారాయణ కుటుంబానికి కే.టీ.ఆర్. ఆర్దిక సాయం…

ఉపాధి కరువై అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న సిరిపురం లక్ష్మినారాయణ భౌతిక దేహానికి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో నివాళులర్పించి, అనంతరం కుటుంబీకులను తెలంగాణ రాష్ట్రం భారత రాష్ట్ర సమితి పార్టీ ఎం.ఎల్.ఏ. కే.టీ.ఆర్. పరామర్శించారు. వారికి తక్షణ సాయం కింద పార్టీ తరఫున 50వేల రూపాయలు ఆర్ధిక సాయాన్ని కుటుంబానికి అందించి నేనున్నానని భరోసానిచ్చారు. నేతన్న కుటుంబానికి ప్రభుత్వం తరఫున రావాల్సిన ఆర్థిక సహాయానికి సంబంధించి కలెక్టర్ అనురాగ్ జయంతి తో మాట్లాడారు.