మిచాంగ్ తుపాన్ తో విద్యాసంస్థలకు సెలవు…
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా మిచాంగ్ తుపానుగా మారి ఈదురుగాలులు, భారీవర్షాల కారణంగా సామర్లకోటమండలం, పట్టణ పరిధిలో అన్నిప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలను మూసివేశారు. ఈమేరకు విద్యా శాఖ ఆర్జేడీ నాగమణి నుంచి ఎం.ఈ.వో. కార్యాలయాలకు ఉత్తర్వులు అందాయి. కాగా మంగళవారంకూడా తుపాన్ ప్రభావం ఉన్నందున మంగళ వారం కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు ఆర్జేడీ నాగమణి సాయంత్రం వెల్లడించారు.
