స్వామి వారి రథం సిద్ధం…
బీ.ఆర్. అంబెత్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కాళ్యాణ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్బంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథాన్ని తీసి సద్ధం చేస్తున్నారని ఆలయ అసిస్టెంట్ కమీషనర్ వి. సత్యనారాయణ తెలిపారు. ఆ రథానికి పూజలు ఘనంగా నిర్విహించి రథోత్సవానికి సిద్ధం చేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి. సత్యనారాయణ, స్థానాచార్యులు వి. రంగాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.
