మహారాష్ట్రలోని రాయ్గడ్లో బస్సు బోల్తా… నలుగురికి గాయాలు…
మహారాష్ట్రలోని రాయ్గఢ్ ప్రాంతంలో మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎం.ఎస్.ఆర్.టీ.సీ. బస్సు బోల్తా పడిన ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సుమారు 50 మంది ప్రయాణికులతో బస్సు అలీబాగ్ నుంచి పన్వేల్కు వెళ్తుండగా పోయినాడ్ ప్రాంతంలోని కర్లేఖిండ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. యాక్సిల్ విరగడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం బోల్తా పడింది. గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రికి తరలించగా ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ మార్గంలో ట్రాఫిక్ సాధారణ […]
