మీడియా ప్రతినిధులను భయపెట్టడం సరికాదు… -నాదెండ్ల మనోహర్-
బాధితులెవరైనా, బాధించేది ఎవరైనా దాన్ని నిర్భయంగా ప్రజలకి తెలియచేయడం మీడియా బాధ్యతని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ అన్నారు. వాక్ స్వాతంత్రపు హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛను అనుసరించి వార్తలను, జరుగుతున్న పరిణామాల్ని మీడియా సమాజానికి చేరవేస్తూ ఉంటుందన్నారు. విశాఖపట్నం బర్మా కాలనీలో సుంకర ధనలక్ష్మి కుటుంబంపై దాడి ఘటనలో బాధితులు చెప్పింది, వారు చేసిన ఆరోపణలను మీడియాలో ప్రసారం చేయడాన్ని నేరంగా పరిగణించడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు. మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రజ్యోతిపైనా, వాటి ప్రతినిధులపై […]


