WhatsApp Image 2024-01-18 at 11.54.09 AM Political

షోకాజ్ నోటీసుల్లో అంగన్వాడీలు…

వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చమని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీ వర్కర్లు చేపట్టిన న్యాయ పోరాట దీక్ష 37వ రోజుకు చేరుకుంది. ఈ నేపధ్యంలో తుని పట్టణంలో జీ.ఎన్.టీ. రోడ్డు ఆవరణలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఇటీవల ఐ.సీ.డీ.ఎస్. ప్రాజెక్ట్ పరిధలో అధికారులు అంగన్వాడీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసారు. కాని వారు వాటిని తీసుకోవడానికి నిరాకరించడంతో వాటిని పోస్ట్ ద్వారా పంపించినట్లు తెలిపారు.