త్రిపురలో బీ.జే.పీ. కి భారీ షాక్… కాంగ్రెస్ లోకి చేరిన బీ.జే.పీ. నేత…
ఏప్రిల్ 19న పశ్చిమ త్రిపుర నియోజకవర్గానికి పోలింగ్ జరగనున్న కొద్ది రోజుల ముందు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు అరుణ్ చంద్ర భౌమిక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ త్రిపుర జిల్లాలోని బెలోనియా నుంచి గెలుపొందినప్పటికీ గత ఏడాది జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో తనను విస్మరించినందుకు భౌమిక్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 77 ఏళ్ల వృద్ధుడు 2017లో బీ.జే.పీ. కి మారడానికి ముందు కొన్నాళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ […]









